PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.

0
99

ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద నిర్మించే పేదల ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.2.39 లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1.20 లక్షల రాయితీని అందిస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతంగా రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా రూ.48 వేలు ఉంటాయి. దీనికి అదనంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణం కోసం మరో రూ.12 వేలు కేటాయిస్తారు.

 

పావలా వడ్డీకి రూ.80 వేల డ్వాక్రా రుణం.. వడ్డీ ప్రభుత్వానిదే

వీటితో పాటు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీకే రూ.80 వేల బ్యాంకు రుణాన్ని కూడా మంజూరు చేస్తారు. ఈ రుణంపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. పెంచిన ధరల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాల పక్కా ఇంటి కల నెరవేరనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా పోలీస్   *గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా...
By Rajini Kumari 2026-01-25 11:11:48 0 131
Telangana
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే...
By Veeresh Kumar 2026-03-27 00:58:55 0 216
Telangana
టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!
IND vs WI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన...
By Yadamma Raju Gajapaga 2026-03-01 18:48:44 0 112
Andhra Pradesh
పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*   *పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ...
By Rajini Kumari 2026-02-23 12:45:06 0 124
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 999
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com