కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

0
188

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి గారికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.  

‎ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూ కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. 

‎కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు.

‎తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు.

‎మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని తెలిపారు.

‎తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలు
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి  ముగ్గురికి తీవ్ర గాయాలు మార్కాపురం జిల్లా.......
By Chennaiah Kati 2026-03-05 03:26:00 0 186
Andhra Pradesh
మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు...
By Pagadala Venkateswar 2026-03-11 03:11:49 0 91
Telangana
Citizen Rights & Corporate Accountability
In Wake of Sigachi Blast: Citizen Rights, Safety & Corporate Duty The devastating reactor...
By Citizen Rights Council 2025-07-01 05:55:28 0 2K
Andhra Pradesh
నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీష దేవి
*Photos:-* రంపచోడవరం మండలం సీతపల్లికి చేరుకున్న భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శిరీషా...
By Rajini Kumari 2025-12-21 14:14:13 0 195
Andhra Pradesh
మల్లన్న సన్నిధిలో భక్తుల తాకిడి !!
కర్నూలు : శని, ఆదివారాలు సెలవులు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. వేలాది మంది...
By Hari Krishna 2025-12-22 02:01:21 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com