పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|

0
157

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని  జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బిజెపి నాయకులు దండా నిర్వహించారు.  అనంతరం అల్వాల్ లోని సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. 

అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య–వితంతు–దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా వంటి కీలక హామీలు ఇంకా అమలు కాలేదని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని బీజేపీ నాయకులు అన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ల కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పేదల కోసం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కూడా ఇప్పటికీ అమలు కాకపోవడంతో అనేక కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

ఇక జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నాయకులు హెచ్చరించారు.

అల్వాల్ సర్కిల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఘటన చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి బాధితురాలు చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-02-18 10:22:18 0 209
Andhra Pradesh
OTT సెన్సార్ బోర్డు వర్తించదు కేంద్రమంత్రి మురుగన్
*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*   డిజిటల్ వినోదంలో మార్పుల...
By Rajini Kumari 2025-12-18 08:36:58 0 172
Telangana
భీమ్ రావ్ నగర్ లో డ్రైనేజీ పైప్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భీమ్ రావు నగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ...
By Sidhu Maroju 2026-02-27 12:34:40 0 155
Andhra Pradesh
పులివెందుల ZPTC ఉప ఎన్నికలు – MLA ఎన్నికల కంటే కఠినమైన భద్రత
ఆంధ్రప్రదేశ్‌ - పులివెందులలో జరగనున్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ (ZPTC) ఉప...
By Bharat Aawaz 2025-08-11 18:22:55 0 710
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com