యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|

0
132

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకున్నారు. 

శుక్రవారం ఆమె హైదరాబాద్ జలమండలి (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకముగా కలిశారు.

ఈ భేటీలో అల్వాల్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల (Sewerage) పనులతో పాటు, ఇప్పటికే మంజూరైన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. 

పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎండీని కోరారు.

ముఖ్యంగా సంపత్ చిత్తారి కాలనీ మరియు బండబస్తీ వాసుల తాగునీటి కష్టాలను తీర్చడానికి కొత్త వాటర్ లైన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆమె ఎండీకి వినతి పత్రం సమర్పించారు. 

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా స్థానిక ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఎండీ అశోక్ రెడ్డి , సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:06:30 0 78
Tamilnadu
Tamil Nadu tragedy: 20 injured as sewage tank explodes at factory in Cuddalore district
Cuddalore (Tamil Nadu): In a tragic incident, as many as 20 people sustained injuries after a...
By BMA ADMIN 2025-05-19 19:11:44 0 2K
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 106
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-03-03 09:39:07 0 124
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com