యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|

0
104

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకున్నారు. 

శుక్రవారం ఆమె హైదరాబాద్ జలమండలి (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకముగా కలిశారు.

ఈ భేటీలో అల్వాల్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల (Sewerage) పనులతో పాటు, ఇప్పటికే మంజూరైన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. 

పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎండీని కోరారు.

ముఖ్యంగా సంపత్ చిత్తారి కాలనీ మరియు బండబస్తీ వాసుల తాగునీటి కష్టాలను తీర్చడానికి కొత్త వాటర్ లైన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆమె ఎండీకి వినతి పత్రం సమర్పించారు. 

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా స్థానిక ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఎండీ అశోక్ రెడ్డి , సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-02-01 11:58:05 0 182
Andhra Pradesh
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ::
కర్నూలు : పాణ్యం:  కర్నూలు టౌన్ లో కల్లూరు అర్బన్ 31 వ వార్డు బద్రీనాథ్ నగర్ లో ఎన్టీఆర్...
By Hari Krishna 2025-12-31 11:19:35 0 149
Andhra Pradesh
* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య* ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు...
By Chennaiah Kati 2026-02-09 04:51:04 1 560
Andhra Pradesh
# కొత్తూరు మురళి.
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి దేవాలయం, సాక్షాత్తు అగస్త్య మహాముని...
By Kothuru Murali 2026-01-26 13:57:47 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com