‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*

0
275

గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది మంది రైతులు పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి ట్యాంకార్లతో నీళ్లు కొనుక్కొని తెచ్చుకొని పంటలను కాపాడుకున్న సందర్భం మనం చూసినం,రైతులు ఆరుగలం కష్టం చేసి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతే ఆ రైతు బాధ అంత ఇంత కాదు,అదే విధంగా చెరువుల నీళ్లు లేక గంగపుత్రుల జీవనదారం అయిన చేపలు కూడా చనిపోయి వారి ఉపాధి పోయి వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

‎అందుకే వారి పక్షాన రైతుల పక్షపాతి BRS పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు రుద్రంగి గ్రామానికి ఫిబ్రవరి లోనే నీళ్లు వస్తాయని, గత ప్రభుత్వం ధర్నాలు, రాస్తారోకలు చేస్తే తప్ప రైతులకు నీళ్లు ఇవ్వలేదు, మేము అలా కాదు అవి ఏవి చేయకముందే నీళ్లు ఇస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చిన చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదు.ఎండిన పంటలు పశువుల పాలయ్యాయి, ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలా పేరుతొ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, ఎరువులు సమయానికి ఇవ్వకుండా, కూలి రైతులకు12 వేలు ఇవ్వకుండా వడ్లకు బోనస్ ఇవ్వకుండా,కౌలు రైతులను,రైతులను ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఇప్పుడు 2 రెండు సంవత్సరాలు గడిచిన మాయమాటలతో కాలయాపన చేస్తుంది, మీ హామీలన్నీ అమలు అయ్యేంతవరకు  BRS పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాము, మా BRS పార్టీ ప్రభుత్వ హయాంలోనే కెసిఆర్ గారి నాయకత్వంలో ఎత్తిపోతల పతకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి నీళ్లను కాలువల ద్వారా, మోటార్ పంపుల ద్వారా రుద్రంగి గ్రామానికి కాళేశ్వరం ఎల్లంపల్లి నీళ్లను తెచ్చి రుద్రంగి బీడు భూములను తడిపి పచ్చని పంటపోలలుగా మార్చిన ఘనత BRS పార్టీ గౌరవ కెసిఆర్ గారికే దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యమానేరు ప్రాజెక్టు కు 2004 లో శంకుస్థాపన చేసి తట్టేడు మట్టి కూడా తియ్యలేదు....

‎ముమ్మాటికీ BRS పార్టీ కృషి పోరాట ఫలితమే-నేడు రుద్రంగికి కాళేశ్వరం ఎల్లంపల్లి నీళ్లు రావడం జరిగింది..

‎ఈ నీళ్లు ఎన్ని రోజులు ఇస్తారో చూడాలి??

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన నాయకుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి.
 మదనపల్లి: నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జనసేన...
By Pagadala Venkateswar 2026-02-16 12:58:48 0 190
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 149
Telangana
రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని...
By Sidhu Maroju 2026-06-25 12:06:50 0 82
Andhra Pradesh
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-25 12:44:26 0 183
Business & Finance
Secured Loans for Affordable Business Financing Options
Secured loans allow businesses and individuals to borrow funds by pledging valuable assets such...
By Navya Sree 2026-07-23 06:11:32 0 25
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com