రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|

0
82

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీరాంనగర్-బి, ఎమ్‌ఎఫ్ ఫంక్షనల్ హాల్ ప్రాంతంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

ఆ ప్రాంతంలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.55 లక్షలు మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేసిన కాలనీ వాసులు కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి లాయక్, బోయిని వెంకటేష్, శ్రీధర్ వర్మ, సతీష్ బాబు, మాయిన్ భాయ్, కాలనీ అధ్యక్షుడు మస్జీద్ భాయ్, హరీష్, ఆఫ్జాల్, శ్రీనివాస్ రావు, రహీమ్, ఖలీమ్, అజయ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Andhra Pradesh
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
By Hari Krishna 2026-01-11 07:29:21 0 226
Andhra Pradesh
ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*   డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI...
By Rajini Kumari 2026-04-23 12:56:27 0 181
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...
By Kothuru Murali 2026-05-17 16:45:50 0 72
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో పెరిగినచలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 13:22:56 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com