చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
Posted 2026-03-10 13:30:28
0
188
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది.
ఈ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.
చెరువును వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అక్కడికక్కడే కాంట్రాక్టర్ను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఏ (SFA) వెంకటేష్, ఎంటమాలజీ విభాగం నుండి గణేష్, డోలి రమేష్, ప్రశాంత్, లింగారెడ్డి, శోభన్, రాజు మరియు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్లో లాజిస్టిక్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది
హైదరాబాద్లో గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు, ఈ-కామర్స్ లాజిస్టిక్స్ మౌలిక వసతులు వేగంగా...
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో యువత ఆవేదన అన్యాయంగా కేసులు నమోదుపై ఆరోపణలు
చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని...
మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా "ప్రజా దర్బార్"..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి తెలుగుదేశం పార్టీ...
Delhi Chokes Under Summer Dust
An investigation has revealed that road dust is the city’s most neglected year-round...