Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

0
105

Andhra

 

CM Chandrababu Naidu Tours Nandyala District Today

డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయ‌నున్న సీఎం

కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్ర‌బాబు

స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

ఇవాళ‌ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: దివాకర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్.
మదనపల్లెలో సంచలనం సృష్టించిన పూల దివాకర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-03-08 04:53:45 0 110
Telangana
Citizen Rights & Corporate Accountability
In Wake of Sigachi Blast: Citizen Rights, Safety & Corporate Duty The devastating reactor...
By Citizen Rights Council 2025-07-01 05:55:28 0 2K
Andhra Pradesh
పుంగనూరు:బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ నిరవధిక దీక్ష
పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్‌లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార...
By Kothuru Murali 2026-04-10 04:48:33 0 73
Andhra Pradesh
జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా  ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :-...
By mahaboob basha 2025-10-02 10:38:48 0 363
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com