Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

0
75

Andhra

 

CM Chandrababu Naidu Tours Nandyala District Today

డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయ‌నున్న సీఎం

కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్ర‌బాబు

స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

ఇవాళ‌ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై...
By Kothuru Murali 2026-02-15 07:14:38 0 90
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 110
Andhra Pradesh
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు ఆధార్ కరెక్షన్.
మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్...
By Pagadala Venkateswar 2026-02-04 07:29:36 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com