Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

0
104

Andhra

 

CM Chandrababu Naidu Tours Nandyala District Today

డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయ‌నున్న సీఎం

కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్ర‌బాబు

స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

ఇవాళ‌ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు...
By Sunka Santhosh 2026-04-21 17:41:23 0 155
Telangana
పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....
   *కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు... * కేంద్ర మంత్రి ఇంటి వెనుక...
By Gujile Ramu 2026-05-03 08:53:49 1 1K
Andhra Pradesh
ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*
భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని...
By John Baji 2025-12-21 10:17:20 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com