రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
Posted 2026-03-08 17:46:06
0
925
కాకినాడ జిల్లా కరప పీహెచ్సీలో కంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన జీతాలు బకాయిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల సాధికారతపై వేడుకలు జరుగుతున్న సమయంలో, మరోవైపు దుర్గ మాత్రం తన జీత బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు తెలిపారు.
దుర్గకు సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కూడా అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయి జీతాలను చెల్లించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్
🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : కొమురం భీమ్...
అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్!
గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం...
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం.
టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి...
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85. 65 కోట్ల ఆదాయం: డీఐజీ.
మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్...
AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉగాదికి జాబ్ క్యాలెండర్!
ఆర్థిక భారాన్ని అంచనా వేసిన తర్వాతే తుది ప్రకటన
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ...