రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
Posted 2026-03-08 17:46:06
0
931
కాకినాడ జిల్లా కరప పీహెచ్సీలో కంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన జీతాలు బకాయిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల సాధికారతపై వేడుకలు జరుగుతున్న సమయంలో, మరోవైపు దుర్గ మాత్రం తన జీత బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు తెలిపారు.
దుర్గకు సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కూడా అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయి జీతాలను చెల్లించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
T. S. Divakara IAS: Leading Telangana's Development
A Dynamic IAS Officer Driving District Administration Through Technology, Transparent Governance,...
హాజీపూర్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో ఉన్న హాజీపూర్ పోలీస్...
మంచిర్యాల: విశ్వనాథ ఆలయ ఈవోగా శ్రీనివాస్
మంచిర్యాల్ లో నీ శ్రీ విశ్వనాథ దేవస్థాన నూతన కార్యనిర్వణ అధికారిగా ఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు...
Gayatri Rathore: Transforming Rajasthan Through Tourism
A distinguished 1997-batch Rajasthan cadre IAS officer, Gayatri A. Rathore has redefined tourism,...
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన...