రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
Posted 2026-03-08 17:46:06
0
942
కాకినాడ జిల్లా కరప పీహెచ్సీలో కంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన జీతాలు బకాయిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల సాధికారతపై వేడుకలు జరుగుతున్న సమయంలో, మరోవైపు దుర్గ మాత్రం తన జీత బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు తెలిపారు.
దుర్గకు సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కూడా అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయి జీతాలను చెల్లించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా సినీ సాహిత్య సాంస్కృతిక ఆవకాయ్ ఘనంగా ఉత్సవాలు
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 23, 2025*...
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
Arunachal Enhances Law, Order and Border Security
Arunachal Pradesh continues to strengthen law and order while enhancing border security through...
చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో...
బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్కు వార్నింగ్!
బస్టాప్లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె...