"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|

0
255

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఎంటమాలజీ సూపర్వైజర్ గణేష్, టీమ్ సభ్యులు సాజిద్, లింగారెడ్డి, మహేందర్ మరియు పోచయ్యలతో కలిసి ఆమె పనులను నిశితంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్రపుడెక్క వల్ల నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ఈ గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించడం అత్యవసరమని అధికారులకు సూచించారు.

పనులను వేగవంతం చేయాలని, మళ్లీ గుర్రపుడెక్క పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 351
Business & Finance
Make in Haryana 2026 Policy Targets ₹5 Lakh Crore Investment
Haryana has launched the Make in Haryana 2026 Industrial Policy along with nine sector-specific...
By Navya Sree 2026-07-04 08:21:05 0 52
Business & Finance
Monsoon Forecast to Support Haryana’s Farm Economy
Weather forecasts indicate increased monsoon activity across Haryana in the coming days, bringing...
By Navya Sree 2026-07-01 08:55:18 0 78
Telangana
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2026-04-13 09:18:00 0 251
Assam
Critical Flood Situation Grips Six Districts in Assam
Assam is currently facing a dire flood crisis, with relentless waters impacting over 46,000...
By Lokeshwari Panthadi 2026-07-01 09:38:25 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com