"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|

0
167

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఎంటమాలజీ సూపర్వైజర్ గణేష్, టీమ్ సభ్యులు సాజిద్, లింగారెడ్డి, మహేందర్ మరియు పోచయ్యలతో కలిసి ఆమె పనులను నిశితంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్రపుడెక్క వల్ల నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ఈ గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించడం అత్యవసరమని అధికారులకు సూచించారు.

పనులను వేగవంతం చేయాలని, మళ్లీ గుర్రపుడెక్క పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం. హోలీ, రంజాన్ పండుగలు కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:17:55 0 203
Andhra Pradesh
RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు...
By Pagadala Venkateswar 2026-01-13 06:03:48 0 168
Rajasthan
MLA Horse-Trading Scandal Businessmen Cleared by ACB |
The Anti-Corruption Bureau (ACB) has cleared businessmen Ashok Singh and Bharat Malani in the...
By Pooja Patil 2025-09-16 04:18:36 0 266
Andhra Pradesh
వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-02-28 11:11:29 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com