*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*

0
907

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మరియు బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఐసిడిఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం మరియు మహిళామణులకు అభినందనల కార్యక్రమంలో పాల్గొని గర్భిణులకు శ్రీమంతపు కిట్లు అందజేసి ఆశీర్వదిస్తున్న బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.  

ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, మహిళలను గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియ జేశారు. మహిళా దినోత్సవం అంటే కేవలం అభినందనలు తెలుపుకోవటం మాత్రమే కాదు అని, మహిళల అభివృద్ధికి పాటు పడుతూ, మహిళలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి అని తెలియ జేశారు. ప్రపంచ జీవనాడికి మూల కేంద్రమైన మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ మహిళా సాధికారత కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియ జేశారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు గా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు మరియు వారి టీమ్ సభ్యులు అందరూ సమాజ సేవా కార్యక్రమాలతో పాటు మహిళలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అద్భుతంగా స్పందించటం, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యునిగా తాండ్ర సాంబశివరావు సంతోషాన్ని వ్యక్త పరిచారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆర్డీఓ గ్లోరియా, బాపట్ల ఎమ్మార్వో సలీమా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారులు, బాపట్ల డి.ఎస్.పి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు శేష కుమారి, నాగమల్లీశ్వరి, శైలజ, అంగన్వాడి కార్యకర్తలు, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ టీమ్ సభ్యులు మరియు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...
By Rajini Kumari 2025-12-23 10:35:39 0 205
Technology
డేటా ప్రైవసీ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు
డేటా ప్రైవసీ చట్టం ఇంకా అమల్లోకి రాలేదుడిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం, 2023 రెండు...
By BMA ADMIN 2025-08-11 07:43:18 0 2K
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు...
By Pagadala Venkateswar 2026-02-11 06:00:20 0 149
Telangana
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్...
By Avunoori Mahesh 2026-04-12 09:03:51 0 214
Tamilnadu
Tamil Nadu Expands Electric Buses and Modern Transport
Tamil Nadu is accelerating the modernization of its public transport system by expanding electric...
By Fathima Safa 2026-06-29 10:09:44 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com