ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసినేని శివనాథ్ జానకి లక్ష్మి

0
173

*ప్రచారుణార్ధం * *07.03.2026*

 

 *ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్, జానకి లక్ష్మి దంపతులు* 

- ఘన స్వాగతం పలికిన ఆలయ పాలకమండలి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు , అధికారులు

 

 *విజయవాడ* :: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేశినేని శివనాద్ (చిన్ని), జానకీ లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. ఎంపీ శివనాధ్ (చిన్ని), జానకీ లక్ష్మీ దంపతులకు ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) , ఆలయ ఈవో శీనా నాయక్ , ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని చిన్ని, జానకి లక్ష్మీ దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ, పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ బంగారు తాపడ రాజగోపురానికి నమస్కరించి ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ అన్నారు. మహా కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్ల తీరు తెన్నులను ఆలయ పాలకమండలి చైర్మన్, ఈవో ను అడిగి ఎంపీ శివనాద్ తెలుసుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా మహా కుంభాభిషేక క్రతువును దిగ్విజయంగా జరిగేలా చూడాలని సూచించారు. ఎంపీ కేశినేని శివనాద్ దంపతులకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం. వెంకట రాఘవ రాజు, టి. పద్మావతి, మన్నే కళావతి, సుకాసి సరిత, వెలగపూడి శంకర్ బాబు స్వాగతం పలికిన వారిలో ఉండగా టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కొత్తపేట పండగ పూట హోంగార్డు ఇంట విషాదం
*బ్రేకింగ్ న్యూస్..!!* *విజయవాడ కొత్తపేట*    *పండగ పూట హోంగార్డు ఇంట తీవ్ర...
By Rajini Kumari 2026-05-29 11:29:26 0 74
Bharat Aawaz
Voter Verification Drive in Bihar May Disenfranchise Millions
Bihar, July 2025: A new voter verification process in Bihar has sparked widespread concern. Ahead...
By Citizen Rights Council 2025-07-29 04:54:33 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-09 07:30:32 0 160
Andhra Pradesh
మదనపల్లెలో టైలర్ పై మందుబాబుల దాడి.
శనివారం మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో టైలర్ బావాజాన్ (43)పై మందుబాబులు దాడి చేశారు. ఉదయం తన...
By Pagadala Venkateswar 2026-06-13 11:02:20 0 79
Telangana
బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియపై ఫోకస్.....!
సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్ భరత్ అవాజ్ న్యూస్: 13 మే నేడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును...
By Gujile Ramu 2026-05-13 00:34:05 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com