నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు

0
456

చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఒక ట్రాక్టర్ ట్రాలీ నిండుగా, ఎటువంటి రక్షణ కవచం తార్పాలిన్ వంటివి లేకుండా మట్టి, రాళ్లను తరలిస్తూ కనిపించింది. ట్రాలీలో మట్టిని దాని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపడం వల్ల, ప్రయాణంలో ఆ మట్టి రోడ్డుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు జారి పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, గాలికి మట్టి రేణువులు ఎగిరి వాహనదారుల కళ్లలో పడటంతో తృటిలో ప్రమాదాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి వాహనాలు వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా, పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే ఇలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ట్రాక్టర్ లోడు పై ఖచ్చితంగా వెనక డోర్లు ,కవర్లు ఉండేలా చూడాలని స్థానికులు కోరారు .

Search
Categories
Read More
Telangana
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.  NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
By Sidhu Maroju 2025-06-24 04:55:54 0 1K
Andhra Pradesh
""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante
శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర...
By Manda Ramkumar 2026-03-26 12:39:08 0 174
Andhra Pradesh
అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా
విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం...
By Eslavath RameshNaik 2026-01-21 14:16:32 0 385
Andhra Pradesh
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడ
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో...
By Patan Khuddus 2026-04-18 16:15:13 0 598
Andhra Pradesh
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
By Kothuru Murali 2026-03-26 14:30:51 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com