శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
126

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి.

పాఠశాల డైరెక్టర్ అంతం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ అంతం సునీతా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. 

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, ఆటపాటలు, ఇతర సృజనాత్మక యాక్టివిటీస్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు కళలు కూడా దోహదపడతాయని తెలిపారు.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు తమ ఉద్యోగ వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆమె సూచించారు. అప్పుడే పిల్లల్లో మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. రంగురంగుల దుస్తుల్లో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం పనితీరుపై రీజనల్ మేనేజర్ సమీక్ష
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్,...
By Kothuru Murali 2026-05-05 15:12:51 0 70
Andhra Pradesh
దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్...
By Boiena Rajesh 2026-03-18 14:39:38 0 161
Andhra Pradesh
Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు.
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు క్యూలైన్లు...
By Pagadala Venkateswar 2026-02-21 04:38:33 0 213
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
By Rajini Kumari 2026-02-28 13:03:28 0 129
Andhra Pradesh
వైసిపి అధినేత మాజీ సీఎం ప్రెస్ మీట్
*వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్..*   ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రెస్...
By Rajini Kumari 2026-01-22 12:22:57 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com