నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు

0
491

చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఒక ట్రాక్టర్ ట్రాలీ నిండుగా, ఎటువంటి రక్షణ కవచం తార్పాలిన్ వంటివి లేకుండా మట్టి, రాళ్లను తరలిస్తూ కనిపించింది. ట్రాలీలో మట్టిని దాని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపడం వల్ల, ప్రయాణంలో ఆ మట్టి రోడ్డుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు జారి పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, గాలికి మట్టి రేణువులు ఎగిరి వాహనదారుల కళ్లలో పడటంతో తృటిలో ప్రమాదాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి వాహనాలు వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా, పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే ఇలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ట్రాక్టర్ లోడు పై ఖచ్చితంగా వెనక డోర్లు ,కవర్లు ఉండేలా చూడాలని స్థానికులు కోరారు .

Search
Categories
Read More
Telangana
"కన్నబిడ్డను వెతికిచ్చిన దేవుళ్లు.. అల్వాల్ పోలీసుల అంకితభావానికి సెల్యూట్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కళ్లముందే ఆడుకుంటున్న కన్నబిడ్డ మాయమైతే ఆ తల్లిదండ్రుల గుండె...
By Sidhu Maroju 2026-04-20 18:08:42 0 180
Telangana
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
By Pinnehasan Odela 2025-12-23 14:02:18 0 309
Business & Finance
Import Services Simplify Global Business Expansion
Import services help businesses source products, raw materials, and equipment from international...
By Navya Sree 2026-07-24 05:22:36 0 19
Andhra Pradesh
రాయచోటిలో పుంగనూరు యువకుడి మృతి
మంగళవారం రాయచోటి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై...
By Kothuru Murali 2026-06-24 16:48:31 0 54
Andhra Pradesh
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ▪️కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:15:05 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com