దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన
06.03.2026
కూడలి దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో, వేద పండితుల మంత్రోచ్చారణల ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల మధ్య జరిగిన పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం శ్రీ రఘురాం గారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను శాసనసభ్యుడుగా ఉండగా ఆలయం పున్న నిర్మాణం జరిగిందని మళ్లీ రాజగోపురం శంకుస్థాపన రావడం దైవనుగ్రహంగా భావిస్తున్నానని రాజగోపురం నిర్మాణం దేవస్థాన వైభవాన్ని మరింత పెంచుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రముగా నిలుస్తుందని తెలిపారు.ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నిర్వాహకులు, దాతలు మరియు గ్రామ ప్రజలను అభినందిస్తూ, ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వేద పండితుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ నెట్టెం శ్రీ రఘురాం గారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్,ఆలయ ఈవో నరసింహమూర్తి,చైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు,గాదెల రామారావు,తోట నాగమల్లేశ్వరరావు,మండవ, కృష్ణకుమారి మండవ రాజేంద్రప్రసాద్ కోవెలమూడివెంకటేశ్వరరావు చెరుకూరు హైమారావు లగడపాటి శ్రీనివాసరావు,చల్లా తులసిరావు చింతోటి సాంబశివరావు, మన్నేపల్లి వినయ్ కుమార్ కొండ్రగంటి వెంకటేశ్వరరావు,యనమదల గోపీ, చెరుకూరు గాంధీ గాదెల వీరబాబు,వడ్డెబోయిన నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz