విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు

0
154

ప్రకటన: మార్చి 07, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి సందర్భంగా శనివారం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించనున్నారు 

రెండవ రోజు కార్యక్రమ వివరాలు:

ఉదయం 8:00 గంటలకు: వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠ పూజలు ప్రారంభమవుతాయి

మధ్యాహ్నం 12:00 గంటలకు: యాగశాలలో మూలమంత్రహవనములు నిర్వహించబడతాయి 

సాయంత్రం 4:00 గంటల నుండి: మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు మరియు హారతి కార్యక్రమాలు ఉంటాయి 

రాత్రి 7:00 గంటలకు: మంత్రపుష్పంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయి 

పత్రికా ప్రకటన: మార్చి 08, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం నేటితో (ఆదివారం) ముగియనుంది. ఈ పవిత్ర క్రతువులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో కుంభాభిషేకం జరుగనుంది .

ముఖ్య ఘట్టాలు:

ఉదయం 7:00 గంటలకు: మంటప పూజలు, మూలమంత్ర హవనములు ప్రారంభమవుతాయి 

ఉదయం 9:00 గంటలకు: పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది 

ఉదయం 9:34 గంటలకు (మేషలగ్నంలో): శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమానగోపురమునకు కంచి పీఠాధిపతుల అమృత హస్తాలతో, పవిత్ర నదీ జలాలతో కుంభాభిషేక క్రతువు నిర్వహించబడుతుంది 

అనుగ్రహ భాషణము: కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణము చేస్తారు 

ఈ మహోత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయ దైవిక శక్తిని పెంపొందించడానికి నిర్వహించబడుతుంది

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 182
Telangana
పారి స్థాయిలో లొంగిపోయిన మావోయిస్టు
ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని, ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు...
By Pinnehasan Odela 2026-03-07 15:38:02 0 215
Telangana
వరంగల్ జిల్లాలోని మొక్కజొన్న వరి ధాన్యాలు మంటలలో బూడిద పాలయ్యాయి.....!
వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు! భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే  నేడు పంట చేతికొచ్చిన...
By Gujile Ramu 2026-05-09 00:17:20 0 138
Tamilnadu
Tamil Nadu's Industrial Growth and Investment Momentum
Tamil Nadu continues to strengthen its position as one of India's leading industrial destinations...
By Fathima Safa 2026-06-20 06:29:43 0 103
SURAKSHA
Government Boosts Police Mobility with 3,000 New Patrol Vehicles
T The Andhra Pradesh government has significantly bolstered its police department's mobility by...
By Kalaga Sailaja 2026-06-30 13:23:25 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com