మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....

0
104

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి తాటాకు ఇల్లు ఇటీవలే కాలంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్న స్టానిక నాయకులు కాని, అధికార కూటమి ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం, కనీసం అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు గారు ఈరోజు ఆవెల్తి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఆ కుటంబానికి బట్టలు, బియ్యం, మరియు ఆర్ధిక సాయం అందించి వారికి ఎల్లప్పుడూ వైస్సార్సీపీ పార్టీ తరుపున అండగా ఉంటామని తెలియజేసారు. మరియు మండలంలో తాళ్లపాలెం, మండపం పలు గ్రామాల్లో పర్యటించి అనేక కుటుంబాలను పరామర్శించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో అయన వెంట మండల కన్వినర్ నరాల శ్రీను, పండు, చెంచుబాబు, ఈగల గంగ, కూనిశెట్టి మాణిక్యం, బర్ల శ్రీను స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-03-07 09:26:12 0 102
Andhra Pradesh
విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:40:27 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com