బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్

0
2K

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో గాయపడి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు.

ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షతగాత్రికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, మందులు మరియు చికిత్సలో ఎలాంటి కొరత ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బాధితులతో స్వయంగా మాట్లాడిన మంత్రి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు చికిత్స వివరాలను మంత్రికి వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Pankaj Joshi, IAS: Steering Gujarat with Vision & Excellence
The Journey Begins "Good governance is not merely about administration—it is about...
By Fathima Safa 2026-07-20 06:35:11 0 34
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 351
SURAKSHA
Karnataka Police Today: Guardians Of Road Safety
Today Karnataka traffic police focused on saving lives on roads. School zones in Bengaluru,...
By Kalaga Sailaja 2026-07-04 06:46:46 0 42
Andhra Pradesh
పొగ మంచు
మంగళవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గంలో దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు...
By Kothuru Murali 2025-12-23 06:06:00 1 289
Andhra Pradesh
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం
*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*   వైకుంఠ...
By Rajini Kumari 2025-12-30 10:09:41 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com