సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు

0
235

సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనివాసరావు సహా పలువురు పేద కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం, జి.మేడపాడు, గుడపర్తి, సామర్లకోట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.

ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మృతుల జాబితా:

  1. గండి మంగ (43), వెట్లపాలెం

  2. వల్లూరి రవి (35), వెట్లపాలెం

  3. కడింపల్లి కృపమ్మ, వెట్లపాలెం

  4. గంపల మంగ, జి.మేడపాడు

  5. గంపల నాగరాజు గోపి, జి.మేడపాడు

  6. బిక్కిన కరుణ సుబ్బారావు (45), వెట్లపాలెం

  7. సాధనాల సత్యవేణి (44), వెట్లపాలెం

  8. గోదత నాని (26), వెట్లపాలెం

  9. తుంపల లోవ (38), దుర్గా నగర్, వెట్లపాలెం

  10. చింతల రమణ (60)

  11. మండపల్లి చిన్ని (44), గుడపర్తి

  12. గోదత మహేష్ (41), గుడపర్తి

  13. దర్శిపాటి నాని (38), కుమ్మరి వీధి, సామర్లకోట

  14. ఏడిద సంపత్ కుమార్ (25), కుమ్మరి వీధి, సామర్లకోట

  15. నుకెళ్ళ దేవి (45), వెట్లపాలెం

  16. గోదత వీర వెంకట రమణ (48), గుడపర్తి

  17. కడింపల్లి ధనరాజు (55), గుడపర్తి

  18. సాకుమళ్ళ రాఘవ (50), వెట్లపాలెం

  19. అడబాల శ్రీనివాసరావు (55), వెట్లపాలెం

  20. మాకర రాఘవమ్మ (55)

  21. (ఒకరి వివరాలు నిర్ధారణలో ఉన్నట్లు సమాచారం)

ఈ ప్రమాదం అనేక కుటుంబాలను అనాథలుగా మార్చింది. గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం త్వరగా అందజేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్నగంజాం సముద్ర తీరంలో ఇద్దరి యువకుల గల్లంతు
చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి...
By Gadiyapudi Narendra 2026-02-05 13:47:41 0 162
Andhra Pradesh
తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!
తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ...
By Pagadala Venkateswar 2026-04-11 06:50:34 0 81
Andhra Pradesh
పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ...
By Kothuru Murali 2025-12-28 09:25:23 0 166
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com