సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు

0
342

సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనివాసరావు సహా పలువురు పేద కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం, జి.మేడపాడు, గుడపర్తి, సామర్లకోట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.

ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మృతుల జాబితా:

  1. గండి మంగ (43), వెట్లపాలెం

  2. వల్లూరి రవి (35), వెట్లపాలెం

  3. కడింపల్లి కృపమ్మ, వెట్లపాలెం

  4. గంపల మంగ, జి.మేడపాడు

  5. గంపల నాగరాజు గోపి, జి.మేడపాడు

  6. బిక్కిన కరుణ సుబ్బారావు (45), వెట్లపాలెం

  7. సాధనాల సత్యవేణి (44), వెట్లపాలెం

  8. గోదత నాని (26), వెట్లపాలెం

  9. తుంపల లోవ (38), దుర్గా నగర్, వెట్లపాలెం

  10. చింతల రమణ (60)

  11. మండపల్లి చిన్ని (44), గుడపర్తి

  12. గోదత మహేష్ (41), గుడపర్తి

  13. దర్శిపాటి నాని (38), కుమ్మరి వీధి, సామర్లకోట

  14. ఏడిద సంపత్ కుమార్ (25), కుమ్మరి వీధి, సామర్లకోట

  15. నుకెళ్ళ దేవి (45), వెట్లపాలెం

  16. గోదత వీర వెంకట రమణ (48), గుడపర్తి

  17. కడింపల్లి ధనరాజు (55), గుడపర్తి

  18. సాకుమళ్ళ రాఘవ (50), వెట్లపాలెం

  19. అడబాల శ్రీనివాసరావు (55), వెట్లపాలెం

  20. మాకర రాఘవమ్మ (55)

  21. (ఒకరి వివరాలు నిర్ధారణలో ఉన్నట్లు సమాచారం)

ఈ ప్రమాదం అనేక కుటుంబాలను అనాథలుగా మార్చింది. గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం త్వరగా అందజేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Search
Categories
Read More
Telangana
In loksabha seats to increase.
దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్...
By G k Nookala 2026-04-13 15:48:58 0 141
Telangana
దండేపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 104 మంది...
By Avunoori Mahesh 2026-06-02 12:15:42 0 135
Andhra Pradesh
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో...
By Gadiyapudi Narendra 2026-01-08 13:59:46 0 211
Telangana
మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి,...
By Pinnehasan Odela 2026-01-14 17:58:26 0 215
Telangana
నిజామాబాద్
ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 19వ డివిజన్ వార్డు సభను నిర్వహించడం జరిగింది ఇందులో...
By Sadaq Sadaq 2026-06-06 10:11:42 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com