వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం.. 21 మంది మృతి
Posted 2026-02-28 14:45:04
0
572
కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 21 మంది కార్మికులు సజీవ దహనమై పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడుధాటికి మృతదేహాలు స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదం సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టారు.
#dadala babji
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్...
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...
మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు...
కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..!
కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ...
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార...