ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|

2
312

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. 

అక్రమ మార్గాల్లో తెలిసిన ఆదాయ వనరులను మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణలతో)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, హైదరాబాద్‌లోని అల్వాల్ సూర్యనగర్ నివాసంతో పాటు నిజామాబాద్‌లోని అద్దె ఇంటి సహా కుటుంబ సభ్యులు, బినామీలు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 

అలాగే సుమారు రూ.3.31 లక్షల నగదు, రూ.50 లక్షల మేర బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించగా, వాటిని త్వరలో తెరిచి పరిశీలించనున్నట్లు సమాచారం.

అదేవిధంగా ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆస్తుల విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేస్తున్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. 

మరికొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సోదాల అనంతరం మల్లారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా ఇతర అధికారిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయాలని శాఖ సూచించింది.

#,Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|
సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు...
By Sidhu Maroju 2026-04-23 06:27:43 0 316
Telangana
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...
By Sadaq Sadaq 2026-04-21 09:20:12 0 154
West Bengal
Citizens Voice Grievances at CM's Second Janata Darbar
West Bengal Chief Minister Suvendu Adhikari held his second Janata Darbar today at the state BJP...
By Dunna Jessicaruth 2026-05-25 11:16:30 0 416
Andhra Pradesh
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-31 07:53:02 0 232
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:27:32 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com