మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ

0
163

మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 28.02.2026.

 

ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, కూటమి నేతలు శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

 

రెడ్డిగూడెం మండలంలో 7,125 మందికి రూ.3,03,84,000లు, 

మైలవరం మండలంలోని 9471 మందికి రూ.4,07,96,000లు,

విజయవాడ రూరల్ మండలంలోని 6,957 మందికి రూ.3,02,93,500లు, 

జి.కొండూరు మండలంలోని 8,472 మందికి రూ.3,61,65,000లు, 

ఇబ్రహీంపట్నం మండలంలోని 4,719 మందికి రూ.2,02,16,500లు, 

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,210 మందికి రూ.2,28,52,000లు మంజూరయ్యాయి.

 

మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి స్పౌజ్ కేటగిరి కింద మార్చి నెలకు నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో కర్ణాటక యువకుడి పై దాడి.
ఆదివారం మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆవరణలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర(23)పై దాడి జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-18 04:14:04 0 78
Andhra Pradesh
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి...
By Gadiyapudi Narendra 2026-01-01 12:02:34 0 241
Telangana
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.
BREAKING    గోశామహల్ ఎమ్మెల్యే,  రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి...
By Sidhu Maroju 2025-07-11 08:51:49 0 1K
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 257
Bharat Aawaz
కలం Vs. కవాతు (The Pen Vs. The March)
కలం Vs. కవాతు (The Pen Vs. The March) జర్నలిజం యొక్క స్వర్ణ సూత్రం 'నిష్పాక్షికత' అని మనకు...
By Bharat Aawaz 2025-07-08 18:01:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com