మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ

0
98

మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 28.02.2026.

 

ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, కూటమి నేతలు శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

 

రెడ్డిగూడెం మండలంలో 7,125 మందికి రూ.3,03,84,000లు, 

మైలవరం మండలంలోని 9471 మందికి రూ.4,07,96,000లు,

విజయవాడ రూరల్ మండలంలోని 6,957 మందికి రూ.3,02,93,500లు, 

జి.కొండూరు మండలంలోని 8,472 మందికి రూ.3,61,65,000లు, 

ఇబ్రహీంపట్నం మండలంలోని 4,719 మందికి రూ.2,02,16,500లు, 

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,210 మందికి రూ.2,28,52,000లు మంజూరయ్యాయి.

 

మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి స్పౌజ్ కేటగిరి కింద మార్చి నెలకు నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
యాక్సిడెంట్.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట...
By Boiena Rajesh 2026-02-28 14:17:55 0 132
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:01:39 0 152
Andhra Pradesh
రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?
చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల  పనులు 3.10 కోట్లు మంజూరు...
By Shyamala Yadagiri 2026-04-04 03:51:22 0 80
Andhra Pradesh
ఆగిరిపల్లి పోతవరప్పాడు లో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు...  ...
By Rajini Kumari 2025-12-22 08:08:29 2 902
Tamilnadu
Hinduja Group Pledges ₹7,500 Cr for Tamil Nadu EV Ecosystem |
The Hinduja Group has committed ₹7,500 crore to develop Tamil Nadu’s electric vehicle...
By Pooja Patil 2025-09-16 10:19:24 0 541
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com