పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 

0
182

పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
చీరాల: రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు., చీరాల మండలం  ఓడరేవు గ్రామం, వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయితీ తుఫాన్ పేటలో ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్‌ సామాజిక పెన్షన్లను  అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని, అయితే జనవరి 1వ తేదీన జరిగాల్సిన పంపిణీ నూతన సంవత్సరం సెలవు కారణంగా ఒక రోజు ముందుగానే అర్హులకు పెన్షన్లు అందించడం జరుగుతోందన్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లును అర్హులకు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతోందన్నారు. కాగా ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా ప్రతి నెలా ఖచ్చితంగా ఒకటవ తేదీనే పెన్షన్లను అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిచడం జరుగుతోందన్నారు. గడిచిన 18నెలల్లో ఇప్పటివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద 677 మందికి రూ.6.58కోట్ల సాయం అందించామని, చీరాల చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అన్నారు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పారదర్శకతకు నిదర్శనమన్నారు. గతంలో సీఎం ఆర్‌ ఎఫ్‌  చెక్కు కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదన్నారు. గత వైసిపి హయాంలో ఒక్కటంటే ఒక్క చెక్కు ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 140
Bharat
👉 వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి...
By SivaNagendra Annapareddy 2025-12-23 07:56:19 0 210
Andhra Pradesh
ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో సమగ్ర కుటుంబ సర్వే - ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ...
By John Baji 2025-12-25 05:59:51 0 230
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 14:21:35 0 68
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com