ఆపదలో ఉన్న వారికి వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : లబ్ధిదారులకు అండగా ఎమ్మెల్యే మర్రి. |

0
116

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 

హనుమాన్ నగర్‌కు చెందిన పద్మజ అనే మహిళ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 1,25,000 విలువైన CMRF (LOC) చెక్కును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం లబ్ధిదారురాలికి అందజేశారు. 

బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తమ కార్యాలయం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా చెక్కు అందుకున్న పద్మజ కుటుంబ సభ్యులు తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, బిఆర్ఎస్ (BRS) నాయకులు విజయ్ శేఖర్, మోసిన్, నరప్ప మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 88
Andhra Pradesh
తూర్పు నియోజకవర్గం ప్రజా దర్బార్లో వినతి పత్రాలు స్వీకరణ కార్పొరేటర్ మమ్ము నేని ప్రసాద్
*ప్రజా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం* - *కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్* *తూర్పు కార్యాలయం...
By Rajini Kumari 2025-12-27 11:02:43 0 148
Andhra Pradesh
Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:49:12 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com