కర్నూలు జిల్లాలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమాలు

1
388

కర్నూలు : 

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో 

రాత్రి బస (పల్లె నిద్ర)  కార్యక్రమాలు నిర్వహిస్తున్న కర్నూలు  పోలీసులు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసు అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 6  గ్రామాలలో రాత్రి బస ( పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

గ్రామస్తులతో మాట్లాడి  ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని,  ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాల జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

  డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మకూడదని, మహిళలు, బాలబాలికల పై జరిగే నేరాలు, సైబర్ మోసాల బారిన పడకూడదని,  అపరిచితుల కాల్స్ మరియు  లింకులు క్లిక్ చేయరాదని, బ్యాంకు ఖాతాల ఓటిపిలు తెలియని ఎవరికి చెప్పకూడదని, రోడ్డు ప్రమాదాల గురించి  ప్రజలకు అవగాహన  చేస్తున్నారు. 

 ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. 

 రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.

గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా  తమ వంతు భాద్యతగా  గ్రామాలలోని యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలియజేస్తున్నారు. 

ఈ కార్యక్రమాలలో పోలీసు అధికారులు, గ్రామాలలోని ప్రజలు యువత,  తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
నో పెట్రోల్ .. నో హెల్మెట్ : కర్నూల్
కర్నూలు జిల్లా :  కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో...
By Hari Krishna 2025-12-25 07:55:48 0 180
Telangana
అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్స్ పంపిన చేసిన ఎంమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి...
By Avunoori Mahesh 2026-04-11 17:42:18 0 132
Andhra Pradesh
దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ను ముట్టుకోరు ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్
🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ...
By Rajini Kumari 2026-01-10 13:18:49 0 138
Andhra Pradesh
నాగులపాలెం వద్ద స్కూల్ రహదారి మూసివేతపై ఆందోళన – సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి–167...
By Gadiyapudi Narendra 2026-03-10 07:48:06 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com