హైడ్రా మోడల్‌కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|

0
164

హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Asset Protection Agency) జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. నగరంలో వరదల నివారణకు హైడ్రా చేపడుతున్న చర్యలు ఇతర మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఈ క్రమంలోనే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) హైడ్రా పనితీరుపై ఆసక్తి కనబరుస్తూ, తమ నగరంలో కూడా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. సీఎండీఏ ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్‌ లో పర్యటించి, హైడ్రా చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది.

ఇక ఇదే సమయంలో హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో రూ.1,200 కోట్ల విలువైన సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో తన కట్టుదిట్టమైన నిబద్ధతను మరోసారి చాటుకుంది.

ఖానామెట్‌లోని సర్వే నంబర్ 55లో ఉన్న ఈ విలువైన భూమిని కొన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. రెవెన్యూ రికార్డులను పరిశీలించి అది ప్రభుత్వ భూమేనని నిర్ధారించిన అధికారులు, వెంటనే అక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థలాన్ని కంచెతో చుట్టి, ప్రభుత్వ ఆస్తిగా బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సీఎండీఏ బృందం ముఖ్యంగా నాలాలు, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా అమలు చేస్తున్న వ్యూహాలపై ప్రత్యేక ఆసక్తి చూపింది. 

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అమీర్‌పేట, ప్యాట్నీ ప్రాంతాల్లో జరుగుతున్న నాలాల విస్తరణ పనులు, వరద ముప్పును తగ్గించే చర్యలను వివరించినట్లు సమాచారం.

హైడ్రా పనితీరు ప్రశంసనీయం అని పేర్కొన్న సీఎండీఏ అధికారులు, ఈ మోడల్‌ను చెన్నైలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.

2024లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా, అతి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెరువులు, పార్కులు, నాలాలతో పాటు విలువైన ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షిస్తూ, నగర అభివృద్ధికి కీలక భూమిక పోషిస్తోంది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు...
By Kothuru Murali 2026-04-08 07:31:45 0 136
Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టు
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో , ‎ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ...
By Ponnala Srinivasrao 2026-04-23 00:40:18 0 113
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 141
Andhra Pradesh
Madanapalle: కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మదనపల్లె, తిరుపతి కేంద్రాల్లో ఐటీ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్.
మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్...
By Pagadala Venkateswar 2026-07-22 11:32:40 0 28
Chandigarh
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation In a major...
By BMA ADMIN 2025-05-21 05:48:27 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com