Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.

0
209

వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు

టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతుందన్న అధికారులు

రూ. 300 టికెట్ ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని వెల్లడి

 

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

 

 

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. 

 

నిన్న మొత్తం 74,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 22,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.05 కోట్ల ఆదాయం వచ్చింది.

Search
Categories
Read More
Telangana
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి...
By Mitappaly Shiavji 2026-01-09 06:56:01 0 348
Telangana
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు...
By Ellandula Sandeep 2026-02-25 15:04:24 0 272
Andhra Pradesh
ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులుండాలి
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ...
By Boiena Rajesh 2026-05-09 13:22:37 0 88
Telangana
గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల
*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను...
By CM_ Krishna 2026-01-14 05:00:14 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com