Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.

0
294

వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు

టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతుందన్న అధికారులు

రూ. 300 టికెట్ ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని వెల్లడి

 

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

 

 

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. 

 

నిన్న మొత్తం 74,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 22,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.05 కోట్ల ఆదాయం వచ్చింది.

Search
Categories
Read More
Andhra Pradesh
జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు
*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*   *3వ రోజు 10 జట్ల మధ్య 5...
By Rajini Kumari 2025-12-24 08:08:18 0 195
Andhra Pradesh
Pattadar passbook distribution in vemuru
వేమూరు నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబుగారు...   వేమూరు...
By G k Nookala 2026-04-08 17:29:18 0 188
Telangana
మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారునికి అదే శిక్ష విధించండి...డాక్టర్ అంబలా ప్రభాకర్ ,బి ఎస్ పి
నిరుపేదలు తప్పు చేస్తే ‎నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా  ‎వెంటనే అరెస్టులు/...
By Ponnala Srinivasrao 2026-05-13 00:46:55 0 113
Telangana
Suryapeta news
సూర్యాపేట జిల్లా లోనీ పనిగిరి దగ్గర గోర ఆక్సిడెంట్ నిన్నా సాయంత్రం కారు అతివేగంగా బైక్ ను డికొనడం...
By Mahankali Ravi 2026-05-25 10:41:27 0 179
Andhra Pradesh
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.
Andhra Summer heatwave and rains happens in Andhra Pradesh ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న...
By Pagadala Venkateswar 2026-04-30 04:52:50 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com