బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం

0
192
 
బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటనపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు.
చిన్నవయసులోనే యువకులు మృత్యువాత పడటం తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగరాజు
కాలువలో ఈత కొడుతూ పిట్టల వాని పాలెం మండలం పోతన కట్ట వారి పాలెం చెందిన పీటా లీలా వంశీకృష్ణ, బాపట్ల మండలం కనకాద్రి నగర్ యాటగిరి చందు ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. ఆయా కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. దురదృష్టకరమైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాదకరమైన నాగరాజు కాలువలో ఎవ్వరూ మునగటానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచన చేశామని తెలిపారు. ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన చేశామని అన్నారు. జరిగిన సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతదేహాలను బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోటు ద్వారా బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామ సిద్ధార్థ ఆధ్వర్యం లో రెస్క్యూ టీం బృందాలను కాలువ వద్దకు పిలిపించి పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బంది సాయం తో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు (24-02-2026) న మృతదేహాన్ని కాలువ నుండి వెలికి తీసి పోలీసులకు అప్పగించడం జరిగింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ K.Vinay గారు అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Business & Finance
Rajasthan and Haryana Sign Yamuna Water Project Pact
Rajasthan and Haryana have signed an agreement to implement the long-pending Yamuna Water...
By Navya Sree 2026-06-30 06:21:05 0 32
SURAKSHA
Manoj Abraham IPS: Driving Innovation and Excellence in Kerala Policing
"A police force becomes stronger when it combines discipline with innovation and public trust."...
By Fathima Safa 2026-07-08 08:00:51 0 124
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్...
By Kothuru Murali 2026-02-16 11:35:12 0 186
SURAKSHA
Nipun Jindal IAS: A Visionary Administrator Driving Change
From grassroots governance in Himachal Pradesh to shaping India's economic administration, Nipun...
By Kalaga Sailaja 2026-07-21 08:28:10 0 25
Arunachal Pradesh
Cultural Echoes: Adi Community Celebrates Etor Gidi Festival
The rhythmic beats of the Delong dance filled the air today as the Adi community celebrated Etor...
By Dunna Jessicaruth 2026-05-15 07:11:48 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com