మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.

0
130

మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆలయ తలుపులు పగులగొట్టి, సుమారు 3 కేజీల వెండి కిరీటాలు, బంగారు తాళిబొట్లు, శంకు చక్రాలు, వెండి కన్నులు, నామాలు, శఠారి, పంచపాత్రలతో పాటు హుండీ నగదును అపహరించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్ర నిపుణుల బృందం ఆధారాలు సేకరించింది. ఈ భారీ చోరీతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవీ విద్యార్థుల విజయభేరి
నందవరం మండల కేంద్రం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ 40 మంది విద్యార్థులకు పరీక్షలు రాయగా 39...
By Boya Dasthagiri 2026-04-15 08:41:24 0 123
Andhra Pradesh
వైఎస్సార్సీపీ నేత ఇంటిపై జేసీబీ దాడి: నాయకుల ఖండన.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు...
By Pagadala Venkateswar 2026-05-09 07:56:47 0 73
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Andhra Pradesh
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వాయిదా.
AP: వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? లేదా?.. ఉంటే ఎవరెవరిని విచారించాలో...
By Pagadala Venkateswar 2026-01-20 06:25:58 0 146
Andhra Pradesh
ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు....
By Pagadala Venkateswar 2026-03-07 04:49:13 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com