సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
155

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు...
By Sidhu Maroju 2025-08-24 10:04:35 0 490
Prop News
PROPIINN:- Redefining Real Estate for a Smarter Tomorrow
PROPIINN: Redefining Real Estate for a Smarter Tomorrow In a world where real estate is both a...
By Hazu MD. 2025-05-19 11:41:58 0 3K
Andhra Pradesh
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*   *మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*  ...
By Rajini Kumari 2026-01-05 11:43:59 0 150
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 218
Nagaland
Assam Rifles Conduct Rubaru Mental Wellness Sessions in Nagaland
The #AssamRifles organized a "Rubaru" mental wellness session across #Kohima, Dimapur, and...
By Pooja Patil 2025-09-13 11:48:49 0 171
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com