సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
213

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Haryana
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
By Dunna Jessicaruth 2026-05-16 06:26:50 0 153
Andhra Pradesh
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా :...
By Chennaiah Kati 2026-06-18 08:30:50 0 64
Andhra Pradesh
మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల...
By Pagadala Venkateswar 2026-03-06 09:27:14 0 154
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం...
By Patan Khuddus 2026-05-16 03:30:51 0 222
Andhra Pradesh
రాయచోటి: భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ - ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు, సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన పోలీసు...
By Pagadala Venkateswar 2026-05-30 11:33:33 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com