సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
184

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. విద్యార్థులకు అవకాశం.
మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు...
By Pagadala Venkateswar 2026-03-27 05:34:28 0 130
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 67
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026, ...
By Rajini Kumari 2026-04-13 08:14:03 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com