హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|

0
161

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్ 199లో హిందూ శ్మశానవాటిక స్థలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చెత్త ట్రాన్సఫర్ స్టేషన్ ని వెంటనే నిలిపివేసి మరో చోటకి తరలించాలని శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కమీషనర్ విజయ్ కృష్ణ రెడ్డిని మచ్చబొల్లారం జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి వినతి పత్రం అందజేశారు. 

 

దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం ఒక దాత దాతృత్వంతో ఏర్పాటు అయ్యిన మచ్చ బొల్లారం స్మశానవాటికను ప్రభుత్వం డంపింగ్ యార్డుగా మార్చింది.. అని జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్మశానవాటిక స్థలంలో డంపింగ్ నిలిపివేయాలి అని ఆదేశాల జారీ చేసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

కమిషనర్  వెంటనే ఒక నిర్ణయం తీసుకొని స్మశానవాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయాలి అని జేఏసి అధ్యక్షులు ఉదయ్ ప్రకాష్ కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, జేఏసి నాయకులు సుధాకర్ పడల, మెట్టు రాజశేఖర్, ప్రవీణ్, పుష్ప, పవన్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు...
By Kothuru Murali 2026-02-26 12:38:22 0 99
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 499
Telangana
మెదక్ జిల్లా గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి... సీఎం కప్పు ర్యాలీ నిర్వహణ... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా...
By Gangaram Rangagowni 2026-01-09 07:01:21 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com