మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం

0
177

కృష్ణా జిల్లా పోలీస్ 

 

*మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు.*

 

మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీం మరియు ఈగల్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గల విజయానంద డిగ్రీ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యసనం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత మరియు ట్రాఫిక్ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

 

 మాదక ద్రవ్యాల వలన శారీరక, మానసిక మరియు సామాజికంగా కలిగే తీవ్రమైన దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించబడింది.

 

అదనంగా సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, అనుమానాస్పద లింకులు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలు తెలియజేశారు.

 

పిల్లల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, చట్టపరమైన రక్షణలు మరియు సహాయ మార్గాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయబడింది.

 

ప్రతి ఒక్కరు శక్తి యాప్ను కలిగి ఉండాలని దాని యొక్క వినియోగం మరియు ఆవశ్యకతల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.

 

రహదారి భద్రత నియమాలు పాటించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేయడం జరిగినది.

 

కార్యక్రమం మొత్తం సమయంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో, ఈ అవగాహన కార్యక్రమం వారి భద్రత, బాధ్యత మరియు చట్టపరమైన అవగాహనను పెంపొందించే దిశగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Search
Categories
Read More
Andhra Pradesh
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:08 0 820
Telangana
అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా
అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా...
By Sidhu Maroju 2025-06-05 05:10:27 0 2K
Telangana
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన...
By Avunoori Mahesh 2026-06-02 05:29:56 0 135
Andhra Pradesh
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
By Hari Krishna 2025-12-14 14:03:45 0 292
Telangana
నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30...
By Sadaq Sadaq 2026-02-23 13:42:45 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com