మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం

0
125

కృష్ణా జిల్లా పోలీస్ 

 

*మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు.*

 

మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీం మరియు ఈగల్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గల విజయానంద డిగ్రీ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యసనం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత మరియు ట్రాఫిక్ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

 

 మాదక ద్రవ్యాల వలన శారీరక, మానసిక మరియు సామాజికంగా కలిగే తీవ్రమైన దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించబడింది.

 

అదనంగా సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, అనుమానాస్పద లింకులు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలు తెలియజేశారు.

 

పిల్లల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, చట్టపరమైన రక్షణలు మరియు సహాయ మార్గాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయబడింది.

 

ప్రతి ఒక్కరు శక్తి యాప్ను కలిగి ఉండాలని దాని యొక్క వినియోగం మరియు ఆవశ్యకతల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.

 

రహదారి భద్రత నియమాలు పాటించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేయడం జరిగినది.

 

కార్యక్రమం మొత్తం సమయంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో, ఈ అవగాహన కార్యక్రమం వారి భద్రత, బాధ్యత మరియు చట్టపరమైన అవగాహనను పెంపొందించే దిశగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Search
Categories
Read More
Andhra Pradesh
నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు: బొత్స
తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆరోగ్యంగానే ఉన్నానని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ...
By Boiena Rajesh 2026-02-28 02:47:25 0 118
Andhra Pradesh
వైసిపి నెయ్యి అంశం పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ పై దుష్ప్రచారం
*ప్రచురణార్థం* *20-02-2026*   *వైసిపి కల్తీ నెయ్యి అంశం ప‌క్క దారిప‌ట్టించేందుకే...
By Rajini Kumari 2026-02-20 23:24:30 0 99
Nagaland
नेपाल संकट पर नागालैंड सरकार की एडवाइजरी, चिंता गहराई”
नेपाल में चल रहे संकट को देखतै नागालैंड सरकार नै अपने नागरिकां खातिर #Advisory जारी करी है। सरकार...
By Pooja Patil 2025-09-12 04:55:03 0 222
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 2K
Andhra Pradesh
ఆరోగ్యవరం మిషనరీలో నిధుల దుర్వినియోగం: ఏడుగురిపై కేసు.
మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-03-10 04:40:35 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com