మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం

0
178

కృష్ణా జిల్లా పోలీస్ 

 

*మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు.*

 

మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీం మరియు ఈగల్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గల విజయానంద డిగ్రీ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యసనం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత మరియు ట్రాఫిక్ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

 

 మాదక ద్రవ్యాల వలన శారీరక, మానసిక మరియు సామాజికంగా కలిగే తీవ్రమైన దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించబడింది.

 

అదనంగా సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, అనుమానాస్పద లింకులు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలు తెలియజేశారు.

 

పిల్లల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, చట్టపరమైన రక్షణలు మరియు సహాయ మార్గాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయబడింది.

 

ప్రతి ఒక్కరు శక్తి యాప్ను కలిగి ఉండాలని దాని యొక్క వినియోగం మరియు ఆవశ్యకతల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.

 

రహదారి భద్రత నియమాలు పాటించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేయడం జరిగినది.

 

కార్యక్రమం మొత్తం సమయంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో, ఈ అవగాహన కార్యక్రమం వారి భద్రత, బాధ్యత మరియు చట్టపరమైన అవగాహనను పెంపొందించే దిశగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Search
Categories
Read More
Business & Finance
Monsoon Rains Disrupt Trade and Transport in Manipur
Heavy monsoon rainfall across parts of Northeast India continues to affect transportation,...
By Navya Sree 2026-07-02 12:24:20 0 63
Telangana
రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న...
By Ponnala Srinivasrao 2026-05-06 04:29:14 0 131
Andhra Pradesh
జనసేన పార్టీ పదవుల కోసం ప్రొఫైల్ సేకరణ ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీలో పదవుల కోసం వీర సైనికులు,...
By Pagadala Venkateswar 2026-06-29 08:00:42 0 56
Andhra Pradesh
అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే
*తెలుగు రాష్ట్రాల  అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*...
By Rajini Kumari 2025-12-13 08:53:05 0 287
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com