బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం

0
125

*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*

 

బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం వెంక‌య్య‌ చేసిన సేవలు చిరస్మరణీయం

 

ఐలాపురం వెంక‌య్య కుటంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

 

వెంక‌య్య కుటుంబానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రగాఢ సానుభూతి

 

 

విజ‌య‌వాడ : ఇటీవ‌ల మృతి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు, వ్యాపార‌వేత్త‌, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (96) కుటుంబ సభ్యుల్ని ఎంపీ కేశినేని శివనాథ్ సోమ‌వారం పరామర్శించారు. దుర్గా ఆగ్ర‌హ‌రంలోని ఆయ‌న నివాసానికి వెళ్లి ఆయ‌న కుమారులు ఐలాపురం రాజ‌, ఐలాపురం అరుణ్ కుమార్ ల‌తో పాటు ఇత‌ర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియపర్చి,ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్బంగా వ్యాపార‌వేత్త‌గా హోట‌ల్ రంగంలో, బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, టి.ఎన్.ఎస్.ఎఫ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కనకదుర్గమ్మ కోవెల కు తెలుగు సినీ నటుడు సాయిధర్మతేజ్
ఈరోజు మధ్యాహ్నం తెలుగు సినీనటుడు శ్రీ సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ ) శ్రీ కనకదుర్గ అమ్మవారిని...
By Rajini Kumari 2026-01-06 11:00:05 0 167
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 146
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి...
By Pagadala Venkateswar 2026-04-28 03:48:54 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com