యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు - పరిశీలించిన మైనంపల్లి .|

0
164

మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా :  అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు మేడ్చల్-మల్కాజిగిరి ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  ప్రత్యేక చొరవ తీసుకున్నారు. VBR గార్డెన్స్ నుండి S.N. రెడ్డి ఎన్క్లేవ్ వరకు హైటెన్షన్ లైన్ వెంట చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన జాయింట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపుపై పోలీసులతో చర్చించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మైనంపల్లి  చొరవతో ఈ పనులు నేటి నుంచే పునఃప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ శంకరయ్య, మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com