తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!

0
105

తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది.

 

టీటీడీ గణాంకాల ప్రకారం.. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈ సంఖ్య 12,18,53,535గా ఉంది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే అదనంగా 1.76 కోట్ల లడ్డూల అమ్మకాలు పెరిగాయి. ఈ అమ్మకాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో టీటీడీకి సుమారు రూ. 567 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. అదనంగా లడ్డూలు కావాలనుకునే వారికి ఒక్కో లడ్డూను రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదం విక్రయాలు కూడా కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 275
Andhra Pradesh
Andhra Pradesh Strengthens Startup and Innovation Ecosystem
Andhra Pradesh is steadily expanding its startup and innovation ecosystem through policy support,...
By Fathima Safa 2026-06-27 11:06:22 0 51
SURAKSHA
TN Police Today: Serving Beyond Duty With Humanity
Today Tamil Nadu police officers proved service goes beyond duty hours. In Chennai, Coimbatore,...
By Kalaga Sailaja 2026-07-04 07:34:33 0 40
Telangana
భారీ వర్షాలతో అప్రమత్తమైన హైడ్రా
  నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో నిలిచిన వరద...
By Thalakayala Nagashiva 2026-06-09 14:40:18 0 133
Andhra Pradesh
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు
.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం...
By Kothuru Murali 2026-04-03 09:28:03 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com