Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.

0
100

Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub

నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో అడోబ్, ఆరామ్‌కో, ఎన్విడియా వంటి దిగ్గజాలతో సీఎం భేటీ

ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ కేంద్రాల ఏర్పాటుపై కీలక చర్చలు

టెక్ నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి అతిపెద్ద వనరని స్పష్టం చేసిన చంద్రబాబు

పాఠశాలల్లో రోబోటిక్స్, ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు లెగో సంస్థతో సంప్రదింపులు

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. టెక్ నైపుణ్యాలున్న యువశక్తే రాష్ట్రానికి అతిపెద్ద వనరని, వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాల్లో ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ-ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో భాగంగా పలు అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలతో ఆయన వేర్వేరుగా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్చలు జరిపారు.

 

టెక్ దిగ్గజాలతో కీలక సమావేశాలు

ఏపీ పెవిలియన్‌లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్‌కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్, లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లా వంటి ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

 

ప్రముఖ టెక్నాలజీ సంస్థ అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో భేటీ సందర్భంగా, ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. క్రియేటర్ ఎకానమీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని కోరారు. ఇందుకు స్పందించిన శంతను నారాయణ్, విద్యార్థులు, నిపుణులకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా క్రియేటర్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు, పౌరసేవల డిజిటలైజేషన్ వంటి అంశాలపై కూడా ఇరువురి మధ్య ఫలప్రదమైన చర్చ జరిగింది.

 

ప్రపంచ ఇంధన దిగ్గజం సౌదీ ఆరామ్‌కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో ఏపీలో సౌర విద్యుత్‌తో సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు రాష్ట్రం అత్యంత అనువైన ప్రాంతమని, ఇక్కడ కార్యకలాపాలు విస్తరించాలని ఆరామ్‌కోను ఆహ్వానించారు.

 

ఏఐ, డిజైన్ రంగాల్లో భాగస్వామ్యానికి పిలుపు

ఏఐ చిప్‌ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాలిస్టా రెడ్‌మెండ్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న 'ఏపీ ఫస్ట్' ప్రాజెక్టులో పాలుపంచుకోవాలని కోరారు. ఆటోడెస్క్ సీఈఓ మైక్ హేలీతో మాట్లాడుతూ.. ఏపీలో డిజైన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కోసం ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) అభివృద్ధి చేయాలని సూచించారు.

 

పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ విద్య

పాఠశాల విద్యార్థులకు చిన్నతనం నుంచే టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు లెగో ఎడ్యుకేషన్ సంస్థ సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్‌ను కోరారు. విశాఖపట్నంలో 'లెగోల్యాండ్ కల్చరల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్' ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. క్వాంటెలా ఇంక్ చైర్మన్ శ్రీధర్ గధితో సమావేశమై స్మార్ట్ గవర్నెన్స్, పౌరసేవల్లో ఏఐ సొల్యూషన్స్ వినియోగంపై చర్చించారు.

 

ఏఐ స్టాళ్లను సందర్శించిన సీఎం

సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఏఐ సమ్మిట్‌లోని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఎన్విడియా, టాటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయం, వైద్యం, పరిశ్రమల్లో ఏఐ వినియోగం ద్వారా వస్తున్న ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాటా సంస్థ ఏపీలో అమలు చేస్తున్న 'సంజీవని' (డిజిటల్ హెల్త్ రికార్డులు), డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రదర్శించింది. రోబోటిక్స్, ఏఐ ఆధారిత సేవల గురించి సీఎం ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీలో అగ్రగామిగా నిలపాలన్న తన దార్శనికతను చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*
భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని...
By John Baji 2025-12-21 10:17:20 0 195
Chhattisgarh
Narayanpur, Chhattisgarh:Two Women Naxalites Killed in Chhattisgarh Encounter
Two women Naxalites were killed in an encounter with security forces during a late-night...
By Bharat Aawaz 2025-06-26 06:51:13 0 1K
Telangana
మనూర్ : తాగునీటి సమస్యకు చెక్
మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలోని sc కాలనీలొ త్రాగు నీటి సమస్య పరిస్కారం కొరకు పట్లోళ్ల...
By Gandla Vaijanath 2026-03-14 03:03:28 0 485
Andhra Pradesh
భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ
చీరాల: భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో...
By Gadiyapudi Narendra 2026-01-17 17:00:09 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com