కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

0
924

పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై వృద్ధులకు సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.

అలాగే కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమం తన ప్రాధాన్యతలలో ఒకటని, వారి అవసరాలను గుర్తించి త్వరలోనే ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొండవీడు కోటలో నైట్ టెంట్ క్యాంపెయిన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం
కొండవీడు కోటలో నైట్ టెంట్స్ క్యాంపైన్ – ఏప్రిల్ 11 నుండి ప్రారంభం   పల్నాడు జిల్లా...
By Rajini Kumari 2026-04-13 08:16:36 0 113
Andhra Pradesh
మంగళగిరి ఫ్లైఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు
*మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు*   *సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై...
By Rajini Kumari 2025-12-30 12:23:19 0 147
Telangana
మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన :ఎంపీ వంశీ కృష్ణ
మంచిర్యాల : డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద...
By Avunoori Mahesh 2026-04-14 14:58:47 0 166
Telangana
"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర...
By Sidhu Maroju 2026-05-01 13:50:59 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com