కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

0
1K

పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై వృద్ధులకు సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.

అలాగే కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమం తన ప్రాధాన్యతలలో ఒకటని, వారి అవసరాలను గుర్తించి త్వరలోనే ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:32:05 0 150
Andhra Pradesh
క్యూబాను ఆదుకునేందుకు నిధుల సేకరణ
క్యూబా ప్రజలను ఆదుకునేందుకు బొబ్బిలి పట్టణంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిధులు సేకరించారు....
By Boiena Rajesh 2026-04-08 00:54:47 0 170
Telangana
హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్‌ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి...
By Avunoori Mahesh 2026-04-27 10:18:01 0 176
Telangana
తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్? కసరత్తు పూర్తి చేసిన యూపీఎస్‌సీ.|
  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎంపిక ప్రక్రియ తుది...
By Sidhu Maroju 2026-03-11 17:25:14 0 348
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com