కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై వృద్ధులకు సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.
అలాగే కాకినాడ బోట్స్ క్లబ్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమం తన ప్రాధాన్యతలలో ఒకటని, వారి అవసరాలను గుర్తించి త్వరలోనే ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz