కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్

0
926

పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతినిధులు మాట్లాడుతూ, ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎంపీ అందించిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆశ్రమం త్వరితగతిన పూర్తై వృద్ధులకు సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.

అలాగే కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమం తన ప్రాధాన్యతలలో ఒకటని, వారి అవసరాలను గుర్తించి త్వరలోనే ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమావేశంలో సీనియర్ సిటిజన్ సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...
By Rajini Kumari 2026-01-09 10:19:46 0 147
Andhra Pradesh
రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు...
By Kothuru Murali 2026-05-07 12:25:22 0 63
Andhra Pradesh
ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన...
By Pagadala Venkateswar 2026-05-13 06:20:09 0 49
Andhra Pradesh
పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం
చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు...
By mahaboob basha 2025-07-21 14:59:25 1 931
Tamilnadu
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ
  న్యూస్ (భారత్ ఆవాజ్ ) జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు...
By Midathapalli Kiran Kumar 2026-04-27 03:33:09 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com