• 21 Posts
  • 10 Photos
  • 1 Videos
  • Reporter at Warangal
  • Studied Mahathama gandhi law college at Zpss BOLLIKUNTA
    Class of LLB
  • Followed by 0 people
Basic Info
  • Experience
    Fresher
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలు

    వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

    బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—

    తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

    ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.

    నాయకులు మాట్లాడుతూ—

    కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

    ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.

    గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.

    బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలువరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ—కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.
    0 Comments 0 Shares 521 Views 0 Reviews
  • బొల్లికుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు


    బొల్లికుంట గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, పెద్దలు, సామాజిక సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వేడుకలు ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించడం ద్వారా ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామ యువత ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ గారి సేవలను కొనియాడారు మరియు సమానత్వం, విద్య, న్యాయం వంటి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు.

    గ్రామ పెద్దలు మాట్లాడుతూ, అంబేద్కర్ చూపించిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత కూడా సామాజిక సేవలో ముందుండాలని సూచించారు.

    ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది.

    బొల్లికుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలుబొల్లికుంట గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, పెద్దలు, సామాజిక సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వేడుకలు ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించడం ద్వారా ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామ యువత ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ గారి సేవలను కొనియాడారు మరియు సమానత్వం, విద్య, న్యాయం వంటి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ, అంబేద్కర్ చూపించిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత కూడా సామాజిక సేవలో ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది.
    0 Comments 0 Shares 187 Views 0 Reviews
  • గజ్వేల్: తహశీల్దార్‌పై ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
    గజ్వేల్: తహశీల్దార్‌పై ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90...
    0 Comments 0 Shares 221 Views 0 Reviews
  • వరంగల్
        రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో గుర్తుతేయని మృతదేహం లభ్యం    మత్స్యకారులకు కంటపడటంతో పోలీసులకి సమాచారం..   ఎస్సార్ఎస్పి కెనాల్ కాలువ లో ఆగిపోయిన నీటి ప్రవహం దానితో గుర్తింపు...
    0 Comments 0 Shares 243 Views 0 Reviews
  • మహబూబాబాద్ జిల్లా
    *మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి తోటలో కోడి పందాలు వేస్తుండగా పట్టుకున్న పోలీసులు...*   *30 పందెం కోళ్లు,70 వెయ్యిల నగదు ,ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం...*   *ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...*   *పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*
    0 Comments 0 Shares 252 Views 0 Reviews
  • నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి
    నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు నెలల పసికందు మౌనిక కుల ఉన్మాదానికి బలైపోవడం మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఇది కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు – ఇది సమాజం మొత్తానికి మచ్చ. కులం పేరుతో ద్వేషం పెంచుకుంటూ చివరకు అమాయక శిశువు ప్రాణం తీసే స్థాయికి చేరుకోవడం ఎంత దారుణమో మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కుల...
    0 Comments 0 Shares 277 Views 0 Reviews
  • చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
    *వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.    పడిదం ప్రదీప్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.    గంజాయిని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి తీసుకువచ్చి మండలంలో విక్రయిస్తున్న ప్రదీప్.     మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం,   అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.#sandeep
    0 Comments 0 Shares 401 Views 0 Reviews
  • పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది
    పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది   ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి ఎంపీ నిధుల లెక్క చెప్పకుండా దోచుకున్నారు   పాలకుర్తిలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చింది   అందుకే ఝాన్సీ రెడ్డిని తొలగించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని అధిష్టానాన్ని కోరుతున్నాం - పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నేతలు....
    0 Comments 0 Shares 409 Views 0 Reviews
  • మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*
    *బిగ్ బ్రేకింగ్*.....      *మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*      మీనాక్షి నటరాజన్ తో భేటీకానున్న పాలకుర్తి అసంతృప్తి నేతలు    ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 9:30 కు మీనాక్షి నటరాజన్ తో భేటీ కానున్న తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పి సి ఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్...
    0 Comments 0 Shares 396 Views 0 Reviews
  • రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం
    *రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం*    కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.   ఫిర్యాదుధారుని నాన్న గారి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని, ఫిర్యాదుధారుని పేరు మీద రికార్డులు మార్పు చేయడానికి అనుకూలంగా సంబంధిత అధికారులకు నివేదిక...
    0 Comments 0 Shares 404 Views 0 Reviews
  • నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
        ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు.   ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు.   శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కొండా లక్ష్మారెడ్డి ల సంతాప తీర్మానాలు.   శాసనమండలిలో మాధవరం జగపతిరావు.. అహ్మద్ పీర్ షబ్బీర్ ల సంతాప తీర్మానాలు.    శాసనసభ...
    0 Comments 0 Shares 431 Views 0 Reviews
  • రైతు బంధు ఇప్పట్లో లేనట్లే
    రైతు బంధు ఇప్పట్లో లేనట్లే   తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడంతో ఇప్పుడే రైతు బంధు వేసి వృధా అనే యోచనలో రేవంత్   డిసెంబర్ చివరి వారంలో ఇచ్చే రైతు బంధు బంద్   సాగు భూముల లెక్క తేలిన తరువాతే రైతు బంధు వేస్తాం   తెలంగాణ వ్యాప్తంగా యాసంగి పంట భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి...
    0 Comments 0 Shares 481 Views 0 Reviews
  • ఎన్​ కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి
    రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం   ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు #sandeep   _ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు_   * ఒడిశాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి * కందమూల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు * ఆ ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి *...
    0 Comments 0 Shares 482 Views 0 Reviews
  • పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి
    తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. *“గీత దాటితే వేటు తప్పదు”* అనే సూక్తి గుర్తుచేస్తూ, *పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్...
    0 Comments 0 Shares 485 Views 0 Reviews
  • నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని
    *నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని*   ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు    జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం    గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏంఐఏం పార్టీల తరపున ప్రచారం చేస్తాను   ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.. నేను మాత్రం...
    0 Comments 0 Shares 494 Views 0 Reviews
  • మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
    ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!   మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ నాయక్​ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు   * ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది * కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది * ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్...
    0 Comments 0 Shares 526 Views 0 Reviews
  • Warm Welcome to Siva Ellandula Sandeep !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    #Sandeep
    Warm Welcome to Siva Ellandula Sandeep ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz #Sandeep
    Like
    1
    1 Comments 0 Shares 607 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com