మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్

0
633

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

 

₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!

 

మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ నాయక్​ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

 

* ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది

* కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది

* ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి

* దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇళ్లు, కార్యాలయాలు సహా స్వగ్రామం నిజాంపేట మండలం బల్కంచల్క తండాలో దాడులు చేశారు.

* 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌లోని కిషన్‌ ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు

* మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి

* హిరంగ మార్కెట్‌లో వాటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా

* ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి

* ఆ మధ్య నీటిపారుదలశాఖ ఇంజినీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా, వాటన్నిటి కంటే కిషన్‌ ఆస్తిపాస్తులే అధికమని అంచనా

* సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి

* ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్‌పల్లిలోని కిషన్‌ ఇంటి తలుపుతట్టారు

* విశ్వసనీయ సమాచారంమేరకూ ఆ సమయంలో కిషన్‌ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు

* బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు

* కిషన్‌ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది

* సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు

* కిషన్‌ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు

* అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలు అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు

 

మొదటి నుంచి అవినీతి ఆరోపణలే 

 

* 1994 లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో అడుగుపెట్టిన కిషన్‌పై మొదటి నుంచి అవినీతి ఆరోపణలున్నాయి

* బోధన్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు

* అక్కడే మద్నూర్‌లో చెక్‌పోస్ట్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు

* నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా పనిచేశారు

* తాజా సోదాల్లో నిజామాబాద్‌లో అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది

* ఆ తర్వాత మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా కిషన్ పని చేశారు

* ఏడాదిక్రితమే మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా వెళ్లారు

* ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు

* నిజామాబాద్‌లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, 3 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని రాయల్‌ఓక్ ఫర్నిచర్‌షాప్‌లో ఓనర్‌షిప్, అశోక టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు

* సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయభూమి, 4 వేల గజాల్లో పాలీహౌజ్, నిజామాబాద్‌ మున్సిపాలిటి పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఉన్నట్లు నిర్ధారించారు

* కిషన్‌ బ్యాంకు ఖాతాలో రూ. 1.37 కోట్లు, బ్యాంకు లాకర్లలో కిలోకు పైగా బంగారం, రెండు కార్లు ఉన్నట్లు తేల్చారు

* కిషన్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లపైగానే ఉంటుందని అంచనాకి వచ్చారు

* సోదాల అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు

 

10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు 

 

* ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖలో యథేచ్ఛగా అవినీతి దందా సాగుతోంది

* 10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు నమోదవడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది

* డ్రైవింగ్‌ లైసెన్స్, బండి రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, వాహనం ఫిట్‌నెస్‌ ఇలా ఏ పనికావాలన్న రవాణాశాఖ కార్యాలయాల్లో అధికారిక ఛార్జీలతో పాటు అదనంగా ఇవ్వాల్సిందే

* ప్రతి సేవకి, ఫైల్‌కి ఒక రేటు ఉంటుంది ఆ మేరకు కోడ్‌ ఉంటుంది

* అందులో ఏజెంట్‌ ఎవరు, వచ్చే లంచం ఎంతన్న వివరాలుంటాయి

* కోడ్‌ ఉన్న దరఖాస్తులైతే నిమిషాల్లో పనైపోతుంది

* ఏజెంట్‌ ద్వారా కాకుండా నేరుగా వెళ్తే సిబ్బంది కొర్రీలపై కొర్రీలు వేస్తూ రోజుల తరబడి తిప్పించుకుంటారు

* ఈ అక్రమాల్లో జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి

Search
Categories
Read More
Telangana
"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల...
By Sidhu Maroju 2026-05-15 14:15:23 0 154
Business & Finance
DDA Launches Major Urban Redevelopment Initiative
The Delhi Development Authority (DDA) has unveiled a large-scale urban redevelopment plan aimed...
By Navya Sree 2026-07-06 05:56:18 0 46
SURAKSHA
The Sentinel of Justice: The Unwavering Journey of Shri. Rachakonda Vishwanath
From the Classrooms of Ambition to the Frontlines of Public Service: A Story of Dedication,...
By Kalaga Sailaja 2026-07-14 10:56:49 0 48
Telangana
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
By Nookapangu Manikanta 2026-05-09 09:44:54 0 111
Telangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి: బండి రమేష్
మియాపూర్, జూన్ 5 (న్యూస్ డెస్క్): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల 8వ తేదీ...
By Jagadeesh Babu 2026-06-05 14:40:36 0 517
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com