రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం

0
396

*రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం* 

 

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

 

ఫిర్యాదుధారుని నాన్న గారి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని, ఫిర్యాదుధారుని పేరు మీద రికార్డులు మార్పు చేయడానికి అనుకూలంగా సంబంధిత అధికారులకు నివేదిక పంపేందుకు తహసీల్దార్ శ్రీనివాసరావు రూ.50,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచం మొత్తాన్ని ఒక ప్రైవేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 

సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు ముందస్తుగా వల వేసి, లంచం లావాదేవీ జరుగుతున్న సమయంలో దాడి చేసి తహసీల్దార్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

 

ప్రభుత్వ సేవల కోసం లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా కఠిన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది.

#sandeep

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు...
By Pagadala Venkateswar 2026-04-07 03:58:25 0 92
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం...
By Kothuru Murali 2026-02-08 10:13:44 0 135
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com