నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి

0
153

నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు నెలల పసికందు మౌనిక కుల ఉన్మాదానికి బలైపోవడం మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది.

ఇది కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు – ఇది సమాజం మొత్తానికి మచ్చ. కులం పేరుతో ద్వేషం పెంచుకుంటూ చివరకు అమాయక శిశువు ప్రాణం తీసే స్థాయికి చేరుకోవడం ఎంత దారుణమో మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

కుల వివక్ష భారత రాజ్యాంగం నిరాకరించిన దుష్ప్రవర్తన. సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం – ఇవే మన రాజ్యాంగ మూల సూత్రాలు. కానీ ఇంకా కొన్ని చోట్ల కుల విద్వేషం పేరుతో అమానుష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.

ఈ ఘటనపై బొల్లికుంట గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారి మౌనికకు అశృనివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు – అందరూ కలిసి ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కుల విద్వేషానికి బదులు మానవత్వాన్ని పెంపొందించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణ పరిధిలో అగ్నిప్రమాదం
పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్ మైదానంలో సోమవారం ఆవుల షెడ్డులో వరిగడ్డి వాములో అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-02-10 07:34:28 0 82
Telangana
అరుంధతి ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు -పరిశీలించిన నియోజక వర్గ నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2025-11-26 10:08:26 0 127
Andhra Pradesh
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-03-07 09:26:12 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com