Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"Helmet On, Worries Gone" సందేశంతో సికింద్రాబాద్లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.|సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. "Helmet On, Worries Gone" అనే సందేశంతో రూపొందించిన భారీ హెల్మెట్ శిల్పాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించింది. మెడికవర్ హాస్పిటల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని మల్కాజిగిరి...0 Comments 0 Shares 236 Views 0 Reviews
-
"ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. "|సికింద్రాబాద్ : సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు, మాజీ మంత్రి మరియు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేశారు....0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
"గోవాలో దొరికిన ఢిల్లీ దొంగ.. రూ.82 లక్షల సొత్తు రికవరీ చేసిన మార్కెట్ పోలీసులు"|సికింద్రాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుల చాకచక్యంతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదించబడింది. ఇంటి తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించిన అంతర్రాష్ట్ర దొంగను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు, చోరీకి గురైన మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, పోట్ మార్కెట్ ప్రాంతానికి చెందిన సందీప్ రఘునాథ్ చవాన్ అనే వ్యక్తి ఈ నెల 27న రాత్రి ఇంట్లో చోరీ...0 Comments 0 Shares 193 Views 0 Reviews
-
"జింఖానా గ్రౌండ్స్లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై...0 Comments 0 Shares 217 Views 0 Reviews
-
"జూన్ 2న హైదరాబాద్లో ట్రాఫిక్ అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో పలు మార్గాల్లో ఆంక్షలు!"మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో...0 Comments 0 Shares 285 Views 0 Reviews
-
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జియాగూడకు చెందిన పల్లవి గౌడ్(19) ఛాతిలో పెరిగిన గడ్డకు ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు సమాచారం. పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్...0 Comments 0 Shares 280 Views 0 Reviews
-
"ప్రధాని మోదీ సభకు హైదరాబాద్ హై అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత”హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో మే 10, 2026 సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వద్ద జరగనున్న భారీ బహిరంగ సభకు నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి.సుమతి IPS వెల్లడించారు. సభ ప్రాంగణం...0 Comments 0 Shares 378 Views 0 Reviews
-
"ప్రేమ వివాదం.. బీటెక్ విద్యార్థి హత్య కేసు, ఛేదించిన పోలీసులు.|హైదరాబాద్ : నగరంలోని చిలకలగూడలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య కేసును చిలకలగూడ పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారంపై ఏర్పడిన విభేదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మే 7 రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్...0 Comments 0 Shares 345 Views 0 Reviews
-
"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|హైదరాబాద్ : హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్...0 Comments 0 Shares 343 Views 0 Reviews
-
"రైల్వే స్టేషన్లో.. గంజాయి గుట్టురట్టు”సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ గంజాయి స్మగ్లింగ్ను రైల్వే పోలీసులు భగ్నం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త తనిఖీల్లో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.8.95 లక్షల విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల...0 Comments 0 Shares 287 Views 0 Reviews
-
"రైల్వే స్టేషన్లో.. గంజాయి గుట్టురట్టు”సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ గంజాయి స్మగ్లింగ్ను రైల్వే పోలీసులు భగ్నం చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త తనిఖీల్లో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.8.95 లక్షల విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల...0 Comments 0 Shares 289 Views 0 Reviews
More Results