"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|

0
339

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తున్నా, ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నిధులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, ఈ పర్యటనలో సుమారు రూ. 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి కూడా సన్నాహక సమావేశాల్లో పాల్గొని సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో నగరంలోని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని మోదీకి తమ మద్దతు తెలపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Advances Fisheries and Blue Economy
Andhra Pradesh continues to strengthen its fisheries sector and blue economy through investments...
By Fathima Safa 2026-06-27 11:29:38 0 131
Telangana
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2026-01-23 12:50:14 0 195
Mizoram
Mizoram Suffers ₹1,291 Crore Financial Disaster Blow
A devastating new report reviewed by the State Disaster Management Authority (SDMA) has revealed...
By Lokeshwari Panthadi 2026-06-26 07:44:10 0 57
Telangana
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం:కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్
ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-05-06 16:28:21 1 973
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి...
By Boya Dasthagiri 2026-04-06 10:47:36 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com