రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ

0
349

కాకినాడ రూరల్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మదనపల్లె ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళల అదృశ్యాల అంశంపై గతంలో తీవ్రంగా స్పందించిన నాయకులు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో విఫలమైందని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ...
By Sidhu Maroju 2026-03-12 08:01:10 0 129
Telangana
గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి
ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర...
By Bouth Arun 2025-12-28 09:36:34 1 1K
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 150
Andhra Pradesh
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...
By Kothuru Murali 2026-01-28 09:02:56 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com